Friday 20 March 2009

NTR

నందమూరి తారక రామారావు నిన్న ,నేడు ,రేపు ఏనాటికీ మరువని మహా మనిషి.నాడు చిత్ర సీమని ఏలినా ,నిన్నరాజకీయం లో ప్రభాజనం సృష్టించినా ,నేటి రాజకీయానికి వుపిరిగా నిలచినవాడు. చిన్నపుడు చదివిన పాఠం గుర్తుకొస్తోంది. రాజు -కవి అనే పాఠం.అందులో కవి అంటాడు రాజు నిలుచును విగ్రహలలోన సుకవి నిలుచును ప్రజల హృదయాలలోన.కళాకారుడుగా అయన ప్రజల హృదయాలలో ఎంతగా గుర్తున్నరంటే నేటి రాజికియ నాయకులకు NTR పేరు చెప్పకుండా మనుగడ లేనీ పరిస్తితి.నందమూరి కుటుంబ సభ్యల ని చూస్తే మాత్రం పెరటి చెట్టు విద్యనికి పనికి రాదన్న సామెత లాగా,ఎవరికీ తండ్రి మీద ఏ మాత్రం అభిమానం వున్నటే లేదు.రక్త సంభందం లేని ఎక్కడివారో ఆయన్ను ఎంత గానో అభిమానిస్తారు.మరి రక్తం పంచుకుని పుట్టి ఆ మహానుభావుని పట్ల ఎవరికీ గౌరవేమే లేదనిపిస్తుంది.కానీ ఎవరికీ రామారావు పేరు తలచుకునే హక్కు లేదు.అది ఎ పార్టీ ఐన సరే ఆయన పేరును వాడుకుంటూ ప్రజలను మభ్య పెట్టటం అన్యాయం.గర్హనియైన సంగతతి.

Monday 2 March 2009

చిరంజీవి...........చిన్న suggestion

నేను క్రితం సరి రాసిన పోస్ట్ లో చెప్ప్పను ఇక కుల విబేధాలు మొదలవతాయి అని.అది నిజమేననిఈనాటి మహిళా సంఘాలు నిరూపించాయి. మొత్తం మీద sobharani రోజా ని కామెంట్ చేసిన తీరు,రోజా శోభ రాణి కామెంట్ చేసిన తీరు వినటానికి ఎలా వున్నా, మర్చిపోదమనుకున్నా , మీడియా వారి చలువ వల్ల అది గోటి తో పోయేది గొడ్డలి దాకా వెళ్ళింది అనట్లు ఇవ్వాళా tv9 లో చర్చ కులాల విమర్శ కు దారి తీస్తోంది.చిరంజీవి తన్ను విమర్శించే వాళ్ళని ఎదుర్కోవాలి. మార్పు వురికే రాదు.కొత్త దారిలో వెళ్ళాలనుకుంటే ముళ్ళు రాళ్ళు వుంటాయి.దానిని బాగు చేసుకుంటూ ముందుకు నడవాలి అంతే కానీ తిరిగి అదే దారిలో నడుస్తూ వుంటే మార్పూ తనలో వస్తుంది కానీ సమాజం లో కాదేమో.కేవలం తన ఒక్కడే ప్రజారాజ్యం పాలసీ పాటిస్తే సరిపోదు.తన నేతలు కూడా పాటించేలా చూడాలి .అప్పుడే కదా లీడర్ అయ్యేది.అంతే కాదు తన పార్టీ లో నేతలను కూడా కులం ప్రాతిపదికన కాకుండా విజ్ఞానం ,అనుభవం వున్నవారిని నియమిస్తే బగుటుందేమో.ఎందుకంటే అన్ని పార్టీ లు చేసేదే అది కదా! ఏదో చేస్తారని అనుకుంటే మీరు అదే చేస్తున్నారు.బహుశా రాజకియలింతే ఏమో?మీ పార్టీ కూడా అన్ని పార్టీ లాగానే మారినట్టు వుంది.
కొంచెం వేనకు తిరిగి చూసుకోండి sir