Tuesday 29 September 2009

వంగపండు-దేవి -చర్చా ఇది?

ఈ రోజు ఒక ఛానల్ లో వంగపండు రాసిన పాట గురించి ఒక చర్చ.నాకు వాళ్ళి ద్దరి గురించి సరిగ్గా తెలియదు.కానీ ఆ చర్చ జరగిన విధానం చుస్తే అది వంగాపండుగారిని విమర్శించటం కంటే YSR ని పోగాడటమే తప్పు అన్నా రీతిలో సాగింది.ఎన్ని మాట్లాడిన రాష్ట్రము లో రాజశేఖర్ రెడ్డి అంటే ఎంతోమంది అభిమానం వున్నవారు వున్నారు.ఇంతకు ముందు ఎంత మంది పేదవారి గురించి సహాయం చేసారు? కమ్యూనిస్ట్ పార్టీ లో కమ్మునిసిం కి అర్థం తెలియకుండా వున్నవాళ్ళు చేర్తున్నారని అనిపిస్తుంది ఆవిడని చుస్తే. ఏది ఎలా వున్నా ఈ చర్చ అనేది కేవలమ ఏకపక్షం గా జరిగింది అనిపించింది. కేవలం YSR ని విమర్శించడనికే ఒక చర్చ పెట్టినట్టు వుంది. అందరు డిబేట్ చేయలేరు. వారి అభిప్రాయాల్ని సపోర్ట్ చేసుకోలేరు. మన అభిప్రాయాన్ని రుజువు చేసుకోనంత మాత్రాన తప్పు అని నిర్దారించడం సమంజసం కాదేమో ! వితండవాదం చేసే వారికీ అసలే చెప్పలేము. కార్యక్రమము అంతా కాల్ చేసినవారి అభి ప్రయలు తమకు కావలసింత వరకు వినిపించి మిగతాది కట్ చేయడం ఏక పక్షం గా జరిగిందనడానికి సాక్ష్యం.
ప్రజల భావాలకు అనుగుణంగా మీడియా మారుతుందా ?లేక తన భావాలకు ప్రజలని మారుస్తుందా?
మీడియాకే తెలియాలి .

Thursday 3 September 2009

నివాళి

ఏది చీకటి ?ఏది వెల్తురు?ఏది జీవతం? ఏది మృత్యువు?
ఏది పుణ్యం? ఏది పాపం?ఏది నరకం? ఏది నాకం?
ఏది సత్యం?ఏదసత్యం?ఏదనిత్యం?ఏది నిత్యం?
ఏది ఏకం?ఏది అనేకం?ఏది కారణం?ఏది కార్యం?
ఓ మహాత్మా !ఓ మహర్షి!
ఏది తెలుపు? ఏది నలుపు?ఏది గానం ?ఏది మౌనం?
ఏది నాది ?ఏది నీది?ఏది నీతీ?ఏది నేతి?
నిన్న స్వప్నం నేటి సత్యం.నేటి ఖేదం రేపు రాగం.
ఒకే కాంతి ,ఒకే శాంతి.
ఓ మహర్షి ! ఓ మహాత్మా!
---- శ్రీ శ్రీ

------------------------------------------
శ్రీ వైయస్. రాజశేఖర్ రెడ్డి గారికి మా అశ్రునివాళి .ఎన్నటికి ప్రజల హృదయాలలో చెరగని చిరు నవ్వుతో నిలచిన మానవత మూర్తి.పేదల పెన్నిది,వెనుదిరగని ధీరత్వమున్న వ్యక్తి .అయన లేని లోటు తీర్చలేనిది.